నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : .జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు

by Disha Web Desk 1 |
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : .జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అదనపు కలెక్టర్ బీఎస్.లతకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు చేసినట్లయితే రైతులకు నష్టపరిహారం వచ్చేదన్నారు. మామిడి, జామ పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.80 వేలు ఇతర పంటలకు రూ.20వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలంటూ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, సాంబారి ప్రభాకర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, సురభి నవీన్ రావు, జే.ఎన్. సునీత, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed