కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ యాత్రలో ఉద్రిక్తత..

by Disha Web Desk 1 |
కాంగ్రెస్ పీపుల్స్ మార్చ్ యాత్రలో ఉద్రిక్తత..
X

మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు, ఓదెల జడ్పీటీసీ వర్గీయుల బాహాబాహి

దిశ, కరీంనగర్ బ్యూరో: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాయంత్రం పెద్దపల్లి జిల్లాలోని బొంపల్లి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. ఓదెల జడ్పీటీసీ గంట రాములు వర్గీయుడికి తలకి గాయాలయ్యాయి. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెల జడ్పీటీసీ గంట రాములు వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బాహాబాహికి దిగారు. ఓదెలకు చెందిన రజినీకాంత్ పై విజయరమణా రావు వర్గీయులు దాడి చేయడంతో రజనీకాంత్ తలకి గాయమైంది. దీంతో గంట రాములు వర్గీయులు నిరసనకు దిగారు. అనంతరం గాయపడిన రజనీకాంత్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు.



Next Story

Most Viewed