కోర్టు అదేశాలతో నేడు తెరవనున్న స్ట్రాంగ్ రూం

by Disha Web Desk 1 |
కోర్టు అదేశాలతో నేడు తెరవనున్న స్ట్రాంగ్ రూం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందు ఉంచారు.ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరవనున్నారు. అనంతరం అందులోని డాక్యుమెంట్లను నిర్ణిత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు సమాచారం. అయితే వీ.ఆర్.కే. ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేయనుండడం స్థానికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story

Most Viewed