సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షం : ఎమ్మెల్యే సతీష్ కుమార్

by Disha Web Desk 1 |
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షం : ఎమ్మెల్యే సతీష్ కుమార్
X

దిశ, సైదాపూర్ : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. గురువారం సైదాపూర్ మండల పరిధిలోని ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరిందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని 12 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సైదాపూర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం ఎలాబోతారం, సర్వాయిపేట, వెంకటేశ్వర్ల పల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. రాయికల్ తాండకు, బొమ్మకల్, వంగర గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు కొత్త తిరుపతి రెడ్డి, బిల్లా వెంకట్ రెడ్డి, తహసీల్దార్ దూలం మంజుల, సర్పంచ్ లు చందా శ్రీనివాస్, కొండ గణేష్, కాయిత రాములు, బత్తుల కొమరయ్య, కొత్త రాజిరెడ్డి, తాటిపల్లి యుగేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు సోమారపు రాజయ్య, రేగుల సుమలత- అశోక్, ఎంపీటీసీలు తొంట ఓదెలు, గ్రామశాఖ అధ్యక్షుడు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story