- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభం
by Ratna Kumari |
ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 12 నుంచి ప్రీ ప్రైమరీ విభాగం ప్రారంభం కానున్నదని మండల విద్యాధికారి రామయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

X
దిశ, గన్నేరువరం: ప్రభుత్వ పాఠశాలల్లో జూన్ 12 నుంచి ప్రీ ప్రైమరీ విభాగం ప్రారంభం కానున్నదని మండల విద్యాధికారి రామయ్య ఓ ప్రకటనలో తెలిపారు. మండలం లోని కాసింపేట, మైలారం యూపీఎస్, గన్నేరువరం పీస్ పాఠశాల కు ప్రీ ప్రైమరీ విభాగాలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ప్రతి పాఠశాలలో 25 మంది విద్యార్థుల ప్రవేశాలు జరిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. ఈ పాఠశాలల్లో ఒక ఇన్ స్ట్రక్టర్ ఒక ఆయా పోస్ట్ భర్తీ చేయాల్సి ఉంటుందని అర్హులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ అర్హతతో పాటు డీఈడీ చేసిన స్థానిక మహిళ, ఆయా పోస్టుకు పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళ అర్హులని తెలిపారు. ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Next Story






