పేదల శ్రేయస్సు కోసమే ఆరు గ్యారంటీలు : ఆది శ్రీనివాస్

by Disha Web Desk 23 |
పేదల శ్రేయస్సు కోసమే ఆరు గ్యారంటీలు :  ఆది శ్రీనివాస్
X

దిశ,చందుర్తి : చందుర్తి మండలంలోని. కిష్టంపేట, లింగంపేట, కట్ట లింగంపేట గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కిష్టంపేట,మల్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున బీజేపీ ,బీఆర్ఎస్,వివిధ కుల సంఘాల సభ్యులు చేరారు. వారికి అది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నేను మీ మధ్య ఉన్న అని ,మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాని ఒక్క సారి అవకాశం ఇవ్వాలని కోరారు.

అవతలి పార్టీ వాళ్ళు ఒకరు మూడు నెలల ముందు,ఒకరు ఆరు నెలల ముందు వచ్చిన కొత్త వాళ్లు అని దయచేసి గమనించాలని కోరారు.వేములవాడ ను గత కొన్ని సంవత్సరాలుగా అగ్రవర్ణాల పాలిస్తున్నారు, అని ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాని అన్నారు..అధికార పార్టీ నాయకులు డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్మకున్ననని మిమ్మల్ని నమ్ముకున్నని అన్నారు..నా గెలుపు కోసం కుల సంఘాలు ఏకం కావాలని బంధువుల బాట పట్టి తన గెలుపుకు కృషి చేస్తే ఐదు సంవత్సరాలు మీ సేవ చేసుకుంటానని అన్నారు..కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని అన్నారు.



Next Story