- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్
దిశ, శంకరపట్నం: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణలో దళిత బిడ్డల ఆర్థిక ఎదుగుదల కోసం దళిత బంధు ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో వైఫై సేవలను అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని మెట్టుపల్లి లింగాపూర్ గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవలను అనుసంధానం చేసినందుకు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలో దళిత బంధు ప్రవేశపెట్టి దళిత బిడ్డల ఆర్థిక ఎదుగుదల లక్ష్యంగా 10 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవలను అనుసంధానం చేసి దళిత బిడ్డలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి దళిత బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ సర్పంచ్ అంతం వీరారెడ్డి, మెట్ పల్లి సర్పంచ్ వంగల సరోజన, సంస్థ డైరెక్టర్ శోభన్ బాబు, ప్రముఖ వ్యాపారవేత్త వర్ధిని రవీందర్ రావు, ఉప సర్పంచ్ సంజీవ్ గ్రామపంచాయతీ పాలకొరక సభ్యులు, దళిత సంఘం నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.