తెలంగాణ ఉద్య‌మంలో స‌త్తెమ్మ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం

by Nallavelli.Anjaneyulu |

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, తెలంగాణ ఉద్య‌మ‌కారిణి చిందం స‌త్తెమ్మ మృతి ప‌ట్ల బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ ఉద్య‌మంలో స‌త్తెమ్మ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం
X

దిశ, వేములవాడ టౌన్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, తెలంగాణ ఉద్య‌మ‌కారిణి చిందం స‌త్తెమ్మ మృతి ప‌ట్ల బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. సత్తెమ్మ మరణ వార్త తెలుసుకున్న కేటీఆర్ వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్అండ్ ఆర్ కాల‌నీకి చేరుకొని స‌త్తెమ్మ కి ఘ‌న నివాళుల‌ర్పించారు. పార్థివ దేహం పై బీఆర్ఎస్ పార్టీ జెండా క‌ప్పి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ఓదార్చాడు. అంతిమ యాత్ర‌లో పాల్గొని నాయ‌కుల‌తో క‌లిసి స‌త్తెమ్మ పాడే మోసారు. తెలంగాణ ఉద్య‌మంలో స‌త్తెమ్మ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని.. నిఖార్సైన ఉద్య‌మ‌కారిణిని కోల్పోవ‌డం పార్టీకి తీర‌ని లోటు అని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Next Story