- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆశ’ల ఆవిరి
తనతోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఉన్న వయసులోనే కన్నతండ్రి మృతి చెందిన నాటి నుంచి కుటుంబ సమస్యలు వెంటాడుతున్న ఓ ఆశా కార్యకర్త నేడు భర్త సైతం మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెల్లగా పుట్టెడు దుఖంలో మునిగిపోయింది.

దిశ , ఎల్లారెడ్డిపేట: తనతోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఉన్న వయసులోనే కన్నతండ్రి మృతి చెందిన నాటి నుంచి కుటుంబ సమస్యలు వెంటాడుతున్న ఓ ఆశా కార్యకర్త నేడు భర్త సైతం మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెల్లగా పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెలితే మండల కేంద్రానికి చెందిన కొరి రామవ్వ-బాబు దంపతుల ఒక్కగాక్క కుమార్తె స్వప్న(లత) చిన్న తనంలో ఉండగానే తండ్రి బాబు మృతి చెందాడు. రామవ్వ తన కూతురు ఏలోటూ రాకుండా పోషించుకుంది. దుమాలకు చెందిన నీరెంక రవితో వివాహం జరిపించగా వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించింది.
ఇక తన కుటుంబానికి ఏ లోటూ లేకుండా చిన్న కుటుంబం సంతోషంగా గడుస్తుందని ఆశ పడింది. గ్రామంలో ఆశావర్కర్గా పని చేస్తూ ఊరందరికీ తలలో నాలికలా ఉండేది. ఈ లోగా లత భర్త రవికి గత రెండేండ్ల క్రితం బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడంతో హాస్పిటల్లో చికిత్స చేయించేందుకు సుమారు రూ.2లక్షలు ఖర్చు చేసింది. అప్పుడప్పుడే కోలుకుంటుందనుకుంటున్న సమయంలో లతకు గత ఏడాది క్రితం ఒంట్లో బాగుండక పోవడంతో హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్గా నిర్దారితమైంది.
దీంతో దాతలు, అధికారులు తలా కొంత సాయం చేయగా తాము సైతం అప్పు తెచ్చుకుని చికిత్స చేయించుకుంటుండగా ఇటీవల కొంత కుదుట పడుతున్నది. కాగా గ్రామంలో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ రవి కొంత చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం తల విఫరీతంగా నొప్పి ఉందని చెప్పి ఇంటి ముందు కూర్చొని కుప్పకూలిపోయి నోటి మాట లేకుండా పడిపోయాడు. దీంతో మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్కు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అక్కడ నుంచి చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. పుట్టెడు బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 8309071003కు పోన్పే చేయాలని కోరారు.






