దొరలకు ఒక నీతి.. గిరిజనులకు మరొక నీతా?

by Dishanational1 |
దొరలకు ఒక నీతి.. గిరిజనులకు మరొక నీతా?
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని మల్కాజ్ గిరి ఎంపీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నాడు. ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకుని మీడియాతో మాట్లాడారు.. 'వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు. దొరలకు ఒక నీతి.. గిరిజనులకు ఒక నీతా? మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలి. కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి' అని రేవంత్ రెడ్డి అన్నారు.





Next Story

Most Viewed