పోలీసుల వాహన తనిఖీల్లో నగదు పట్టివేత

by Disha Web Desk 23 |
పోలీసుల వాహన తనిఖీల్లో  నగదు పట్టివేత
X

దిశ,కరీంనగర్ రూరల్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల కోడ్ ను ఉల్లఘించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమ డబ్బు, మద్యం, ఇతర కానుకల సరఫరాను అరికట్టేందుకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కరీంనగర్ రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన గుమ్మడి రమేష్ నుండి సరైన ఆధారాలు లేని రూ. 6,00,000 (ఆరు లక్షల రూపాయలు) మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన పడాల హరీష్ నుంచి రూ. 12,75,651 (పన్నెండు లక్షల డెబ్భై ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలు) పట్టుకుని స్వాధీన పరుచుకున్నామని కరీంనగర్ టూ టౌన్ సీఐ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన డబ్బును తదుపరి ప్రక్రియకు సంబంధిత అధికారుల వద్దకు తరలించామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed