ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కొండముచ్చు ఫోటో

by Ratna Kumari |

ఓట్ల లెక్కింపు సెంటర్ వద్ద పెట్టిన కొండముచ్చు ఫోటో ఇప్పుడు జిల్లాలో చర్చనియాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని సినారే కళామందిరంలో

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కొండముచ్చు ఫోటో
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఓట్ల లెక్కింపు సెంటర్ వద్ద పెట్టిన కొండముచ్చు ఫోటో ఇప్పుడు జిల్లాలో చర్చనియాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని సినారే కళామందిరంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపున‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో అధికారులు వాటిని భయపెట్టేందుకు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కొండముచ్చు ఫోటో ఏర్పాటు చేశారు. అధికారులు ఈ ఫోటో పెట్టడాన్ని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది. పట్టణానికి కోతుల బెడద ఎంత‌ ఎక్కువగా ఉందనో అని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ కోతుల బెడద నివారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Next Story