పిడుగు పాటుకు వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
పిడుగు పాటుకు వ్యక్తి మృతి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి/మల్యాల: మల్యాల మండలంలో ముత్యంపేట (కొండగట్టు) చెందిన ముత్యం మల్లేశం గౌడ్ (55)పిడుగు పాటుకు గురై మృత్యువాత పడ్డాడు. దిగువ కొండగట్టులోని పెట్రోల్ పంప్ ఎదుట తాటి చెట్టు కింద కూర్చుని ముంజలు విక్రయిస్తున్న క్రమంలో చెట్టుపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటు ప్రభావంతో కిందనే ఉన్న మల్లేశం అక్కడక్కడే మృతి చెందాడు.

20 మేకలు మృతి...

ఉరుములు మెరుపుల తో కురిసిన వడగండ్ల వర్షం కారణంగా భీమారం (మేడిపెల్లి) మండలంలోని గోవిందారంలో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన గంగనవేని దేవయ్యకు చెందిన 20 మేకలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.3 లక్షల రూపాయల విలువ చేసే మేకలు పిడుగు పాటుకు మృతి చెందడంతో దేవయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed