ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువకి గండి.. పట్టించుకొని అధికారులు

by Dishanational2 |
ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువకి గండి.. పట్టించుకొని అధికారులు
X

దిశ, సారంగపూర్ : సారంగపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్ ఆర్ ఎస్పీ కాలువకు గండిపడినా అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని పరిసర గ్రామ ప్రజలు తెలియజేశారు. గత వర్షకాలం‌లో పడిన అధిక వర్షాలకు కాలువకి గండి పడిoది. దాన్ని 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదని అటవి ప్రాంతం దగ్గరలో ఉండడం‌తో మేత మేయడానికి అటువైపు వెళ్లిన పశువులు అందులో పడటం తరచూ జరుగుతుందని సమీప ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కాలవ సరిహద్దు గ్రామాలైన హబ్సిపూర్, లక్ష్మీదేవిపల్లి, అర్పపల్లి గ్రామ రైతులు పంట పొలానికి వెళ్లే మార్గం లోనే గండి పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర మాని మరమ్మాతులు చేయాలని కోరారు.



Next Story

Most Viewed