తిమ్మాపూర్ మండలానికి జాతీయ పురస్కారం

by Disha Web Desk 1 |
తిమ్మాపూర్ మండలానికి జాతీయ పురస్కారం
X

దిశ, తిమ్మాపూర్: నేషనల్ పంచాయతీ అవార్డుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీ లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కిషోర్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఎంపీపీ కేతిరెడ్డి వనితా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీడీవో రవీందర్ రెడ్డి అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు సాధనకు కృషి చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో, డీఎల్పీవోకు, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పాలకవర్గాలకు, జిల్లా, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు, ఆపరేటర్లకు ఎంపీపీ కేతిరెడ్డి వనితా రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed