రేపు కొండగట్టుకు ఎమ్మెల్సీ కవిత

by Disha Web Desk 1 |
రేపు కొండగట్టుకు ఎమ్మెల్సీ కవిత
X

దిశ, మల్యాల : కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి బుధవారం రోజున ఎమ్మెల్సీ కవిత రానున్నారు. చిన్న హనుమాన్ జయంతి మొదలుకొని పెద్ద హనుమాన్ జయంతి వరకు 41 రోజులు జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణయానికి బుధవారం రోజున ఆమె హాజరు కానున్నారు. ఎమ్మెల్సీ కవితతో సహా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే కొండగట్టు వస్తున్న సందర్భంగా తగు ఏర్పాట్లను చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.



Next Story