ఏఎల్పీ గనికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. బాధిత కుటుంబాలకు పరామర్శ

by Disha Web Desk 4 |
ఏఎల్పీ గనికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. బాధిత కుటుంబాలకు పరామర్శ
X

దిశ, రామగిరి: రామగుండం 3 ఏరియా అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ప్రమాద స్థలానికి మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గనిలోకి దిగడంతో అక్కడే ఉన్న సింగరేణి డైరెక్టర్ బలరాం, ఇతర అధికారులు ఎమ్మెల్యేకు పరిస్థితిని వివరించారు. అనంతరం ప్రమాదంలో చిక్కుకున్న బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సోమవారం సాయంత్రం నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నా పరిస్థితి అదుపులోకి రావడంలేదు. రెస్క్యూ టీం బొగ్గును తొలగిస్తున్న కొద్ది మళ్లీ కూలిపోతుండడంతో సహాయక చర్యల్లో అంతరాయం ఏర్పడుతుందని తెలుస్తోంది.



Next Story

Most Viewed