ఈ వాటర్ ఫౌంటెన్‌లు యావత్ ప్రపంచంలో కేవలం 3 దేశాలలో మాత్రమే ఉన్నాయి

by Dishanational1 |
ఈ వాటర్ ఫౌంటెన్‌లు యావత్ ప్రపంచంలో కేవలం 3 దేశాలలో మాత్రమే ఉన్నాయి
X

దిశ, కరీంనగర్ టౌన్: యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా అత్యాధునిక హాంగులతో భావితరానికి వందేళ్లు సరిపడేలా మానేరు రివర్ ఫ్రంట్ నిలువనుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం మానకొండూర్ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, నగర మేయర్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వంతెనపై రూ. 6.5 కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్ లైటింగ్ సిస్టం పనులను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయో వందేళ్ల భావితరానికి సరిపడే అభివృద్దితో నిర్మిస్తున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులతో కరీంనగర్ జిల్లా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుందని పేర్కోన్నారు. మానేరు వంతెన నిర్మాణ పనులు ఒకవైపు పూర్తిచేసుకోవడం జరిగిందని మరోవైపు కూడా త్వరలోనే పూర్తిచేసుకుని రోడ్డు పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మానేరు వంతెనను మరింత అందంగా తీర్చిదిద్దే క్రమంలో వంతెనపై రూ. 6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టం పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని, వీటితోపాటుగా అల్గునూర్ బ్రిడ్జిపై నిలబడి చూసిన స్పష్టంగా కనిపించేలా జర్మన్ టెక్నాలజీతో 45 వేల పిక్సల్ గల 10x30 సైజులో 65 కనిపించేలా మానేరు వంతెనకు ఇరువైపుల రెండుచోప్పున 4 టీవీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా అడ్వర్టైజ్ మెంట్ మొదలగు చిత్రాలను ప్రదర్శించడం జరుగుతుందని పేర్కోన్నారు.

ఇప్పటికే పలు పారిశ్రామిక రంగాల దృష్టిని సైతం ఆకర్షించడంతో హోటల్ మొదలగు వాటి ఏర్పాటు పలువురు ముందుకువస్తున్నారని తెలిపారు. వీటి పనుల పూర్తిని బట్టి జూన్ 2న గానీ లేదా ఆగష్టు 15 న ప్రారంభించుకోవడానికి ప్రణాళికలను సిద్దం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మానేరు వంతెన ఒకవైపు ఇప్పటికే పూర్తిఅయిందని, మరో వైపు కూడా పూర్తిచేసుకుని వాహనాల రాకపోకలను ఉగాది నుండి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇదివరకే అనుకున్నట్లుగా అప్పర్, లోయర్ ప్రామినెడ్ పనులను కూడా పూర్తిచేసుకుని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఫౌంటెన్ ను పనులకు రూ. 60 కోట్లు మంజూరై టెండర్లు పూర్తయినవని, 3,4 రోజులలో పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని.. ఈ వాటర్ ఫౌంటెన్ లు యావత్ ప్రపంచంలోనే మూడు దేశాలలో మాత్రమే ఉన్నాయని, చైనా, సౌత్ కొరియా లోని సియోల్ తరువాత మన కరీంనగర్ లోనే ఈ వాటర్ ఫౌంటెన్ ఉండనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మెయర్ చల్లస్వరూపరాణి, కరీంనగర్, జిందా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, కొత్తపెల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఆర్అండ్ బీ ఈఈ సాంబశివరావు, డీఈ రవీందర్, ఏఈ రాజా శేఖర్, అశోక్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్ ఇతర అధికారులు, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed