ఏజెంట్ మోసాలు భరించలేక వ్యక్తి ఆత్మహత్య...

by Dishanational1 |
ఏజెంట్ మోసాలు భరించలేక వ్యక్తి ఆత్మహత్య...
X

దిశ, రుద్రంగి: ఏజెంట్ మోసాలకు, అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఏజెంట్ చేసిన మోసాల కారణంగా అప్పుల బాధతో రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వాసాల నరేష్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాసాల నరేష్ 30సంవత్సరాలు. అప్పుల బాధలు, ఏజెంట్ మోసాలతో విసిగిపోయి ఇల్లు గడవడం కష్టంగా మారడంతో మనస్తాపంతో కాలేజీ దగరలోని గుట్ట ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Next Story

Most Viewed