దొంగకు దేహశుద్ది చేసిన యాత్రికులు..

by Disha Web Desk 20 |
దొంగకు దేహశుద్ది చేసిన యాత్రికులు..
X

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణంలోని పార్వతీపురం వసతి గదుల సముదాయం వద్ద ద్విచక్ర వాహనాన్ని దొంగిలించేందుకు యత్నించిన దొంగను గురువారం స్థానికులు, యాత్రికులు కలిసి స్తంభానికి కట్టేశారు. హైదరాబాద్ చెందిన కిషోర్ తన స్నేహితుని కుటుంబాన్ని పరామర్శించేందుకు రాగా అతని ద్విచక్ర వాహనాన్ని అపహరించేందుకు యత్నించిన దొంగకు దేహశుద్ధి చేశారు. దొంగది కొత్తగూడెం అని తన పేరు శంకర అని తెలిపాడు. వేములవాడలోనే కొద్ది రోజుల క్రితం ఇదే దొంగ ఓ బైక్ దొంగలించి పట్టుబడ్డట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed