- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సిరిసిల్లలో నమ్మలేని నిర్వాకం... కేటీఆర్కు ఈ విషయం తెలిసిందనుకో....
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తంగాలపల్లి మండలం పద్మ నగర్ కు చెందిన ఓ విద్యార్థిని ఇంటి దగ్గర నుండి స్కూల్ బస్సులో ఎక్కించుకుని మార్గమధ్యంలో ఫీజు కట్టలేదని దింపెయ్యడం జరిగింది. చదువుకునే వయసులో పసి హృదయాలు ఎంత బాధ చెందుతుందో అర్థం చేసుకోని సమాజంలో ఉన్నట్లుంది. ప్రైవేట్ స్కూల్లో యజమాన్యం అధిక ఫీజులతో బాధించడమే కాకుండా మార్గమధ్యలో విద్యార్థినిని దించి అవమానపరచడం అనేది అవివేకం. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని శుభోదయం ప్రైవేటు పాఠశాల నిర్వాకమిది. విద్యార్థులు ఫీజులు కట్టడం లేదని స్కూల్ యాజమాన్యం విద్యార్థులను స్కూల్ బస్సులో నుండి దింపేస్తున్న బస్సు డ్రైవర్ కు కనికరం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న స్థానికులు ఎందుకు దింపుతున్నారని ప్రశ్నిస్తే స్కూల్ ఫీజు కట్టేంతవరకు స్కూలుకు అనుమతించారని బస్సు డ్రైవర్ తెగేసి చెబుతున్నాడు. దీంతో శుభోదయం ప్రైవేట్ స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.