జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి

by Disha Web Desk 1 |
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : నాలుగేళ్లుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెట్టి చాకిరి చేయించుకోవడమే కాకుండా ఉద్యోగ భద్రత కోసం వారిని రోడ్డెక్కేలా చేశారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మండిపడ్డారు. గత వారం రోజులుగా ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అనంతరం శ్రావణి మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తున్నట్లు జీవో విడుదల చేయాలన్నారు.

అదేవిధంగా నాలుగేళ్ల కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. జీవో నెం.317 తో నష్టపోయిన కార్యదర్శులకు కూడా న్యాయం చేయాలన్నారు. జేపీఎస్ లకు మద్దతు తెలిపిన వారిలో బీజేపీ మహిళ మోర్చ జగిత్యాల పట్టణాధ్యక్షురాలు మమత, జగిత్యాల మండలాధ్యక్షురాలు పత్తి రామేశ్వరి, పుష్ప, కళావతి, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed