గురుకులానికి ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ర్యాంక్

by Disha Web Desk 1 |
గురుకులానికి ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ర్యాంక్
X

తాటిపల్లి గురుకుల విద్యార్థిని విష్ణుప్రియకు 980 మార్కులు

దిశ, మల్యాల : మండల కేంద్రంలోని తాటిపల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విష్ణుప్రియ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 986 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం అర్పపల్లికి చెందిన పాలడుగు విష్ణుప్రియ ఇంటర్ ఫలితాల్లో బైపీసీలో 986 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. తమ కూతరు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీలత సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నం.కిషన్ రెడ్డి విష్ణుప్రియకు అభినందనలు తెలిపారు.



Next Story

Most Viewed