మాకు ఉద్యోగ భద్రత కల్పించండి.. పంచాయతీ కార్యదర్శులు

by Disha Web Desk 20 |
మాకు ఉద్యోగ భద్రత కల్పించండి.. పంచాయతీ కార్యదర్శులు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరసన దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేస్తున్న కార్యదర్శులకు బీజేపీ రాష్ట్ర నాయకుడు ముదిగంటి రవీందర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరసన చేపట్టిన కార్యదర్శుల పట్ల ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కారుణ్య నియమాకాలు చేపట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారిని జేపీఎస్ లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అనంతరం జూనియర్ పంచాయతీ సెక్రటరీల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గత 15 రోజులుగా నిరసన చేస్తున్న తమను పట్టించుకునే వారే లేరని వాపోయారు. ఉద్యోగ భద్రత లేక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని కాబట్టి ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవో తీసుకువచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతూ ఉంటుందని స్పష్టం చేశారు.



Next Story