అట్టహాసంగా పోలీస్ కమిషనరేట్ ప్రారంభం

by Disha Web Desk 1 |
అట్టహాసంగా పోలీస్ కమిషనరేట్ ప్రారంభం
X

దిశ, గోదావరి ఖని : ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనాన్ని సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంతర్గత భద్రత కాపాడే పోలీసులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈరోజు తెలంగాణ ఆచరించేది.. రేపు దేశం అనుసరిస్తోందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని కొనియాడారు. అంతర్గతంగా ఎంత మదనపడ్డ పోలీసులు నిక్కచ్చిగా విధులను నిర్వర్తిస్తున్నరని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంత గొప్ప భవనం కట్టారా అని ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. పోలీస్ కమిషనరేట్ ప్రారంభించిన వారిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, తదితరులు ఉన్నారు



Next Story

Most Viewed