అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్

by velandi.Saikiran |

ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ సీజ్
X

దిశ, మెట్ పల్లి/ఇబ్రహీంపట్నం: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. TS 02 UC 2799 నంబర్ గల లారీ కథలాపూర్ వైపు నుంచి ఆర్మూర్ వైపు తరలిస్తున్న క్రమంలో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేక పోవడంతో డ్రైవర్ నిజామాబాదు జిల్లా బోధన్ పట్టణానికి కు చెందిన షేక్ జాబు పాషా (35) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అటు నిజామాబాద్ జిల్లా అర్సపల్లికి చెందిన లారీ యజమాని మహమ్మద్ నయీముద్దీన్ తో పాటు డ్రైవర్ షేక్ జాబు పాషాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story