దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీయే ప్రధానిగా ఉండాలి : బండి సంజయ్

by Disha Web Desk 23 |
దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీయే ప్రధానిగా ఉండాలి :  బండి సంజయ్
X

దిశ, గన్నేరువరం: దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి కావాలని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నిరుపేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను ఉచిత టీకాలు అందజేసి రక్షించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బండి సంజయ్ ను ముస్లింలంతా ఏకమై ఓడించాలని పిలుపునిస్తే మరి 70 శాతం ఉన్న హిందువులు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ముస్లిం ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే తాను హిందుత్వాన్ని వదిలేస్తానని సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే కేసిఆర్ ముస్లిం మతాన్ని స్వీకరించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ నాయకులు గాడిద గుడ్డు చూయించి ప్రచారం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని ఇప్పటికైనా దేశం సురక్షితంగా ఉండాలంటే బిజెపికి ఓటు వేసి తనను గెలిపించి పార్లమెంటుకు పంపించినట్లయితే దేశంలో మోడీకి మద్దతు తెలిపిన వారు అవుతారని అన్నారు. మోడీ దేశ ప్రజలే కుటుంబం గా సేవ చేస్తున్నారని, మరోమారు ప్రధాని అయితే ప్రపంచ దేశాలలో భారతదేశం ఉన్నత స్థితికి చేర్చుతారని సూచించారు. రైతుల ధాన్యం కొనుగోలు లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు అన్నారు. రామ మందిరాన్ని నిర్మించి, ఆర్టికల్ 370 , వలసలను నిర్మూలించడానికి పౌరసత్వం చట్టాన్ని అమలు చేసిన గొప్ప వ్యక్తి మోడీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు నగునూరి శంకర్, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, నాయకులు సొల్లు అజయ్ వర్మ అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed