హుజురాబాద్‌ను మరో సిద్ధిపేటలా చేస్తా : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

by Disha Web Desk 23 |
హుజురాబాద్‌ను మరో సిద్ధిపేటలా చేస్తా : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
X

దిశ,హుజురాబాద్ : తనకు ఒక్కసారి ఎమ్మెల్యే గా అవకాశం కల్పిస్తే హుజురాబాద్ నియోజకవర్గం సుందరంగా తీర్చిదిద్ది ప్రజల సమస్యలు పరిష్కరించి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ,ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తానని విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. హుజురాబాద్ లోపలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి ఏకగ్రీవ తీర్మానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రానుందని, ఇక్కడ ప్రతిపక్ష నేతలకు అవకాశం కల్పిస్తే హుజురాబాద్ అభివృద్ధి పోతుందని ఆయన అన్నారు.

హుజురాబాద్ ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు.రాబోయే ఎన్నికలు హుజురాబాద్ అభివృద్ధికి అత్యంత కీలకమైనవి ఆయన అన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హుజురాబాద్ లో గులాబీ ప్రభంజనం నడుస్తోందని, ఈసారి ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటివరకు కృషి చేసింది బిఆర్ఎస్ పార్టీ ,బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గులాబీ పార్టీకి మద్దతుగా పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయడం హర్షణీయమని ఇదొక విప్లవమని ఆయన అభివర్ణించారు. కుల సంఘాలు వృత్తి సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయడం హర్షణీయమని, హుజురాబాద్ ప్రజలను తాను కాపాడుకుంటానని తాను గెలిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఆయన అన్నారు.



Next Story

Most Viewed