ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

by Disha Web Desk 1 |
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
X

దిశ, పెగడపల్లి: మండలంలోని బతికేపల్లి గ్రామంలో కొచ్చేరువు గుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు మధుసూదన చార్య, మహేంద్ర చార్యులు ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి చందనోత్సవం చేసి జెండా ఆవిష్కరణ చేసి అనంతరం హోమం నిర్వహించారు.

అనంతరం భక్తులకు స్థానిక సర్పంచ్ శోభరాణి కూతురు డా.చేతన అల్లుడు డా.విజయానంద్ రెడ్డి దంపతులు దాతలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా హనుమాన్ జన్మోత్సవ ఉత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పట్టబధ్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేర్వేరుగా హజరు కాగ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. వారి వెంట జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్ రావు, సర్పంచ్ తాటిపర్తి శోభరాణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుపతి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, ఉపాధ్యక్షుడు సంధి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, సింగిల్ విండో డైరెక్టర్ మద్దెల సుధీర్, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed