ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

by Disha Web Desk 1 |
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని తంగళంలపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పాముల సత్తవ్వ మల్లేశంకు కొడుకు నాగరాజు (25) వీరు గత కొంతకాలంగా చిట్యాల ముత్తయ్య ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. మూడు రోజులుగా తల్లిదండ్రులు వేరే గ్రామానికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న నాగరాజు మూడు రోజుల క్రితమే ఉరివేసుకున్నాడు. ఈ రోజు కిరాయికి ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు గమనించగా నాగరాజు ఇంట్లో ఉరివేసుకొని కనిపించాడని స్థానికులు వెల్లడించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.


Next Story