ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

by Disha Web Desk 1 |
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
X

దిశ, వెల్గటూర్: ఉరేసుకుని ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్గటూరు మండలం కిషన్రావుపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోగే ప్రసాద్ (23), అదే గ్రామానికి చెందిన వరసకు చెల్లి అయ్యే అమ్మాయిని మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇది చాలా తప్పు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని వెంటనే వదిలేయాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. నెలరోజుల క్రితం ఐదైనా ఉద్యోగం వెతుక్కోవడానికి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి అక్కడి నుంచి 22న ఇంటికి తిరిగొచ్చాడు.

అప్పటి నుంచి ప్రసాద్ తీవ్ర మనోవేదనతో ఒంటరిగా ఉంటున్నాడు. తనకు ఇక పెళ్లి కాదేమోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 24న అర్థరాత్రి సమయంలో ప్రసాద్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరక లేదు. ఇంటి నుంచి వెళ్లిన రోజే ప్రసాద్ అదే రాత్రి గ్రామంలోని బోగె చిన్నయ్య వ్యవసాయ భూమిలో ఉన్న టేకు చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బోగే లచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.


Next Story