తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Disha Web Desk 1 |
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, వీణవంక : అకాల వర్షంతో చేతికందిన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ... ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు పది వేల ఆర్థిక సాయం అందజేస్తామన్న ప్రభుత్వ మాటలు ఉట్టి మాటలు గానే మిగిలిపోయాయని, ఓవైపు వర్షాలతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed