రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by velandi.Saikiran |   (  Updated:2025-08-19 15:03:12  IST  )

రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రధాన రహదారి విస్తరణలో కూల్చివేసిన ఇళ్ల మట్టి వ్యర్ధాలను తొలగించే ప్రక్రియను ఆది శ్రీనివాస్

రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేసిన ఇళ్ల మట్టి వ్యర్ధాలను తొలగించే ప్రక్రియను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయ నుంచి మూల వాగు వంతెన వరకు ప్రధాన రహదారి రూ. 47 కోట్లతో వెడల్పు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మట్టి వ్యర్ధాలు తొలగింపు పూర్తికాగానే వేములవాడ పట్టణ ప్రజలు, రాజన్న భక్తుల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోడ్డు పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు.

Next Story