కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు డ‌బ్బాతో రైతు నిర‌స‌న‌

by Ratna Kumari |

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గన్న రాజు రెడ్డి తాను పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ కు తెచ్చారు.

కొనుగోలు కేంద్రం వద్ద పురుగుల మందు డ‌బ్బాతో రైతు నిర‌స‌న‌
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గన్న రాజు రెడ్డి తాను పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ కు తెచ్చారు. 17 శాతం మ్యాచ్ వచ్చే వరకు ధాన్యాన్ని గత 15 రోజులుగా ఆరబోసి కుప్పగా పోసి వర్షం వచ్చిన తడవకుండా నిల్వ చేశాడు. నిర్వాహాకులు సీరియల్ వైస్ గా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. తన వరి ధాన్యం సీరియల్ పేరుతో కాంట పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందుతో నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రాజు రెడ్డి ని సముదాయించారు. అదేవిధంగా ఐకేపీ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని పోలీసులు కోరారు.

Next Story