రోడ్డెక్కిన రైతులు...ట్రాఫిక్ కు అంతరాయం

by velandi.Saikiran |

యూరియా కొరకు రోడ్డెక్కారు రైతులు. సరిపడా యూరియా అందించాలని మంథనిలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రధాన

రోడ్డెక్కిన రైతులు...ట్రాఫిక్ కు అంతరాయం
X

దిశ, మంథని : యూరియా కొరకు రోడ్డెక్కారు రైతులు. సరిపడా యూరియా అందించాలని మంథనిలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రధాన అంబేద్కర్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. రోడ్డు పై కూర్చొని ఆందోళన చేపట్టారు. ఎరువుల దుకాణాల్లో దళారులకు లింకు పెట్టి అక్రమంగా యూరియా విక్రయిస్తున్నారని రైతులు అరోపిస్తున్నారు. యూరియా కొరకు రోజు తిరుగుతున్నామని పడి గాపులు కాస్తున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దింతో కొద్ది సేపు వాహనాదారులకు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి... పరిస్థితిని కంట్రోల్ చేసారు.

Next Story