- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.. చివరి గింజ వరకు కొంటాం : ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
దిశ, హుజూరాబాద్: రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.. చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతునే రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే ఈటల అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేగా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని కౌశిక్ స్పష్టం చేశారు.