కుటుంబ కలహాలు.. మానసిక వేదనతో వృద్ధుడి ఆత్మహత్య

by Bhanu |   (  Updated:2025-06-24 16:11:51  IST  )

ఎండపల్లి మండలం గొడిసెల పేట గ్రామానికి చెందిన గంగాధరి కొమురయ్య (65) అనే వృద్ధుడు సోమవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.

కుటుంబ కలహాలు.. మానసిక వేదనతో వృద్ధుడి ఆత్మహత్య
X

దిశ, వెల్గటూర్ : ఎండపల్లి మండలం గొడిసెల పేట గ్రామానికి చెందిన గంగాధరి కొమురయ్య (65) అనే వృద్ధుడు సోమవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో బాధపడుతున్న కొమురయ్య తీవ్రమైన మానసిక వేదనకు లోనే జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు సేవించినట్లు సమాచారం. కాగా ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ధర్మారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మృతి చెందా డని తెలిసింది. అయితే వృద్ధుడి మృతికి గల కారణాలు పూర్తిగా తెలియ రాలేదు.

Next Story