ఈటలకు క్షమాపణ చెప్పాలి.. రేవంత్ దిష్టిబొమ్మ దహనం..

by Disha Web Desk 20 |
ఈటలకు క్షమాపణ చెప్పాలి.. రేవంత్ దిష్టిబొమ్మ దహనం..
X

దిశ, హుజూరాబాద్ : ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈటల పై అనుచిత వ్యాఖ్యలు, మహిళలను దుర్భాషలాడటాన్ని నిరసిస్తూ బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్బంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం రేవంత్ రెడ్డి స్థాయికి తగదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాముల కుమార్, నాయకులు నల్ల సుమన్, శశిధర్, తిప్పబత్తిని రాజు, తూర్పాటి రాజు, యాళ్ల సంజీవ రెడ్డి, సబ్బని రమేష్, గడ్డం సమ్మయ్య, శాంత కుమార్, కొలిపాక శ్రీనివాస్, తూముల శ్రీనివాస్, పోతుల సంజీవ్, చంద్రగిరి కుమార్, కందుల సందీప్, రాజు, నల్ల అజయ్, సిరిపాటీ వేణు అంజి, అంకటి వాసు, బోరాగల సారయ్య, చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed