దిశ, ఎఫెక్ట్..బుంగను పూడ్చిన అధికారులు

by velandi.Saikiran |

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్-వేగురుపల్లి గ్రామాల మధ్య రహదారిపై ఉన్న ప్రమాదకరమైన బుంగ (గొయ్యి)

దిశ, ఎఫెక్ట్..బుంగను పూడ్చిన అధికారులు
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూర్-వేగురుపల్లి గ్రామాల మధ్య రహదారిపై ఉన్న ప్రమాదకరమైన బుంగ (గొయ్యి) గురించి 'దిశ' వార్తా పత్రికలో 'మృత్యు బుంగ'& 'అధికారుల జాడెక్కడ' అనే శీర్షికలతో కథనాలు ప్రచురించబడ్డాయి. ఈ కథనంలో, నడిరోడ్డుపై ఏర్పడిన ఆ బుంగ (గొయ్యి) వల్ల వాహనాలు (ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు) బోల్తా పడి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొనబడింది.

అధికారుల స్పందన:

దిశ,పేపర్ లో వచ్చిన వార్తకు అధికారులు వెంటనే స్పందించారు. నడిరోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఆ బుంగను తాత్కాలికంగా పూడ్చివేశారు. సమస్యను పరిష్కరించిన అధికారులను, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన దిశ, పత్రికను ప్రజలు అభినందించారు.

Next Story