ఫోటో స్పాట్ గా రాజన్న ఆలయం.. భక్తులు ఫైర్

by Disha Web Desk 4 |
ఫోటో స్పాట్ గా రాజన్న ఆలయం.. భక్తులు ఫైర్
X

దిశ, వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం జరిగిన శ్రీ శివ కల్యాణ మహోత్సవ వేడుకలు పర్యాటక కేంద్రాన్ని గుర్తు చేశాయి. మాములుగా అయితే పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పడు యాత్రికులు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం చూస్తుంటాం. కానీ వేములవాడలో జరిగిన శివ కల్యాణ వేడుకలకు వచ్చిన కొంతమంది భక్తులు, ప్రముఖులు, సేవ సమితి సభ్యులు స్వామి వారి అద్దాల మండపంలో కొలువై ఉన్న ఉత్సవ మూర్తుల ముందు నిల్చొని ఫోటోలు, వీడియోలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది గమనించిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల ఆలయ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed