దళిత బంధు లబ్దిదారుల ఆందోళన.. అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం

by Vinod kumar |

దళితబంధు పథకానికి ఎంపిక కాని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.

దళిత బంధు లబ్దిదారుల ఆందోళన.. అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం
X

దిశ, హుజూరాబాద్: దళితబంధు పథకానికి ఎంపిక కాని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరవుతారన్న సమాచారంతో లబ్ధిదారులు అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అర్హులందరికి దళితబంధు పథకం అందేలా చూడాలని కోరుతూ.. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ కు న్యాయవాది కొత్తూరి రమేష్ వినతి పత్రం సమర్పించారు.

Next Story