Collector : సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

by Sridhar Babu |

సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha)ఆదేశించారు.

Collector : సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
X

దిశ, బోయినిపల్లి : సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha)ఆదేశించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మొదలుకాగా, బోయినిపల్లి మండల కేంద్రంలోని 11వ వార్డులో చేపట్టిన సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ (Random inspection of the survey)చేశారు.

ఎన్యుమరేటర్ బ్లాక్ లోని ఐదు ఇండ్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న విధానంపై అధికారులను ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జాబితా సేకరిస్తారని వివరించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ జయశీల, ఎంపీఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story