రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ హైమ‌ర్ త్రో పోటీల్లో కాంస్య ప‌థ‌కం

by Ratna Kumari |

ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంపతి రక్షిత రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెడరేషన్ కప్ అథెటిక్స్ హైమార్ త్రో పోటీలలో మూడో స్థానం సాధించి కాంస్య పథకాన్ని సాధించిందని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ హైమ‌ర్ త్రో పోటీల్లో కాంస్య ప‌థ‌కం
X

దిశ, ధర్మారం : ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంపతి రక్షిత రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెడరేషన్ కప్ అథెటిక్స్ హైమార్ త్రో పోటీలలో మూడో స్థానం సాధించి కాంస్య పథకాన్ని సాధించిందని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 11 నుంచి 12 వరకు హన్మకొండ జిల్లాలలో జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెడరేషన్ కప్ లో అథ్లెటిక్స్ హైమర్ త్రోలో అండర్ 20 విభాగంలో మూడో స్థానం సాధించి కాంస్య పథకాన్ని పొందడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బైకనీ కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story