ముక్కు నేలకు రాసి కేసీఆర్ క్షమాపణ అడగాలి: BJYM

by Web Desk |
ముక్కు నేలకు రాసి కేసీఆర్ క్షమాపణ అడగాలి: BJYM
X

దిశ, గన్నేరువరం: గన్నేరువరం మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు కూన మహేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ పాల్గొని మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో గ్రామగ్రామాన రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఆలోచనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే రాష్ట్రం ఏర్పడిందని, జ్ఞానంలేని కేసీఆర్ నోరు తాటిమట్టతో సమానం అని విమర్శించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు కోన మహేష్, రామచంద్రం, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story