భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. తల్లీ, కూతురు మిస్సింగ్

by Disha Web Desk 1 |
భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. తల్లీ, కూతురు మిస్సింగ్
X

దిశ, మల్యాల: భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరగడంతో తల్లీ, కూతురు అదృశ్యమైన ఘటన మండల కేంద్రంలోని పోతారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొల్లారపు లత అలియాస్ భవాని తన రెండేళ్ల కూతురు వర్షిణి కనబడట్లేదని బొల్లారపు లత, తల్లి రాగుల లింగవ్వ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 19న రోజున తన అల్లుడైన బొల్లారపు శ్రీకాంత్ తన కూతురు లతకు గొడవ జరిగిందని తెలిపారు. ఇప్పుడు లత నాలుగు నెలల గర్భవతి అని తెలిపారు. బాధితురాలు లత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్ఐ మంద చిరంజీవి తెలిపారు.

Next Story

Most Viewed