అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..

by Disha Web Desk 23 |
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి. విజయలక్ష్మి తెలిపారు. కామర్స్ -1, ఇంగ్లీష్ -1 సబ్జెక్టుల్లో పీజీ 55 శాతం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పీహెచ్ డి/నెట్/సెట్ ,పూర్వనుభావం ఉన్న వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుందని , అర్హత కలిగిన అభ్యర్థులు తేది:08-11-2023 బుధవారం సాయంత్రం 4 గంటల లోపు అప్లికేషన్స్ కళాశాలలో ఇవ్వగలరని తెలిపారు . ఎంపిక ప్రక్రియ 09-11-2023 గురువారం రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేటలో ఉదయం 11 గంటలకు నిర్వహించబడును.


Next Story

Most Viewed