ప్రజావాణిలో ఓ వృద్ధుడి వినూత్న నిరసన

by Disha Web Desk 1 |
ప్రజావాణిలో ఓ వృద్ధుడి వినూత్న నిరసన
X

అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ మెడలో ప్లకార్డు

చంపుతామంటూ సర్పంచ్ బెదిరిస్తున్నారని ఆరోపణ

ఆర్డీవో హామీతో.. నిరసన విరమణ

దిశ, జగిత్యాల ప్రతినిధి : న్యాయం చేయమంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వృద్ధుడు ప్రజావాణిలో వినూత్నంగా నిరసన తెలిపాడు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని మెడలో బోర్డు తగిలించుకొని కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన చెవుల మల్లయ్య తన ఇంటికి వెళ్లే దారిని గ్రామ సర్పంచ్ మరికొంత మందితో కలిసి కందకం తవ్వి మూసి వేశాడని ఆరోపించాడు. తన ఇంటికి వెళ్లేందుకు ఇప్పుడు దారి లేదని సమస్యను పరిష్కరించాల్సిందిగా గత నెలలో ప్రజావాణితో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని ఆవేదన చెందాడు. బతుకుదెరువు కోసం తన ఇద్దరు కొడుకులు గల్ఫ్ బాట పట్టారని వెనుక ముందు ఎవరు లేని తనను సర్పంచ్ చంపుతానని బెదిరిస్తున్నాడని మల్లయ్య ఆరోపించాడు. చివరికి పోలీసులు అక్కడి వెళ్లి ఆర్డీవోతో మాట్లాడించగా.. సమస్య పరిష్కారం చూపుతామనడంతో మల్లయ్య దంపతులు అక్కడి నుండి వెళ్లిపోయారు.


Next Story

Most Viewed