నకిలీ అధికారుల వేషంలో తిరుగుతున్న దొంగల ముఠా

by Ratna Kumari |

"మేమ ప్ర‌భుత్వ అధికారులం.. జనాభా లెక్కలు సేకరించడానికి వచ్చాం" అని ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త..

నకిలీ అధికారుల వేషంలో తిరుగుతున్న దొంగల ముఠా
X

దిశ, కోరుట్ల రూరల్ : "మేమ ప్ర‌భుత్వ అధికారులం.. జనాభా లెక్కలు సేకరించడానికి వచ్చాం" అని ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. వారు అధికారులు కాదు.. అధికారుల ముసుగులో వస్తున్న ఖతర్నాక్ దొంగలు. ​నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఒక దొంగల ముఠా అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. ప్రభుత్వ ఉద్యోగులమని నమ్మించి ఒక మహిళ ఒంటరిగా ఉన్న ఇంటికి వెళ్లారు. తాగడానికి మంచినీళ్లు అడిగి, ఆమెను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించారు. ​లోపలికి వెళ్లగానే ఆ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి ​అరువకుండా నోట్లో గుడ్డలు కుక్కి ​5 తులాల బంగారం, 68 తులాల వెండి ఎత్తుకెళ్లిన సంఘటన జరిగిందని కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు . ​ప్రస్తుతం ఎలాంటి జనాభా లెక్కల సేకరణ జరగడం లేదని, ​ప్రభుత్వ ఉద్యోగులమని ఎవరైనా వస్తే వెంటనే వారి గుర్తింపు కార్డు అడగాలని, అనుమానం వస్తే తలుపు తీయవద్దన్నారు. ​ముఖ్యంగా పగటిపూట ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధులు అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, ​మంచినీళ్లు కావాలి అని అడిగేవారిని కూడా గుడ్డిగా నమ్మి ఇంట్లోకి రానివ్వకండి. ​మీ వీధిలో, మీ ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్లకు 8712656790, 8712656820నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

Next Story