ముగ్గురిపై గృహహింస కేసు నమోదు

by Disha Web Desk 1 |
ముగ్గురిపై గృహహింస కేసు నమోదు
X

దిశ, గంభీరావుపేట: ముగ్గురిపై గృహ హింస కేసు నమోదు ఘటన మండల కేంద్రంలోని మల్లుపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జంపెల్లి లావణ్య యాదవ కులస్థులైన 2002లో గూడూరు గ్రామానికి చెందిన జంపల్లి రవికి ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.1.5 లక్షల నగదు, ఆరు తులాల బంగారం, ఇతర లంఛనాలు ఇచ్చి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వారిద్దరికి ఒక కుమర్తె, కుమారుడు సంతానం. 2007 భర్త, అత్త, మామలు లావణ్యను బాగానే చూసుకున్నారు.

ఆ తరువాత తమకు అదనపు కట్నం కావాలంటూ భర్త రవి, అత్తమామలు నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, అదనపు కట్నం కింద రూ.5 లక్షల తీసుకురావాలంటూ ప్రతిరోజూ చిత్ర హింసలకు గురి చేస్తున్నట్లు లావణ్య ఫిర్యాదులో తెలిపింది. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నా.. అదే విధంగా చిత్రహింసలు చేస్తున్నారని వారిలో మార్పు రాకపోవడంతోనే భర్త జంపల్లి రవి, అత్త మల్లవ్వ, మామ మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు లావణ్య తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed