Kavitha: కల్వకుంట్ల కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు

by Ramesh Naini |

పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ఆర్గనైషన్‌పై ఫోకస్ పెంచింది.

Kavitha: కల్వకుంట్ల కవిత సమక్షంలో.. బీఆర్ఎస్ నుంచి జాగృతిలో చేరికలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నుంచి (Telangana Jagruti) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేసిన తర్వాత ఆమె తెలంగాణ జాగృతి ఆర్గనైషన్‌పై ఫోకస్ పెంచింది. జాగృతి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకులు జాగృతిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు పలువురు (BRS) బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం పార్టీలో చేరుతున్నారు.

తాజాగా కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నంగవత్ రాజేశ్ నాయక్ సహా పలువురు జిల్లా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో కండువాలు కప్పి వారిని కవిత సంస్థలోకి ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన వారంతా జాగృతిలో చేరడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత సంతోషం వ్యక్తం చేశారు.

Next Story